Saturday 13 March 2010

ఉపోద్ఘాతం-2

అసలు హిందూ మతం, పురాణాలు, హైందవతత్వం మధ్య చాలా మంది ఎందుకు గందరగోళానికి గురి అవుతుంటారంటే.. ఇవన్నీ ప్రాచీన ఉద్గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తుల నుంచే ఆవిర్భవించాయి కాబట్టి. ఈ గ్రంథాల్లో చాలా చోట్ల మతానికి సంబంధించిన, తత్వానికి సంబంధించిన విషయాలను మరింత అర్థవంతంగా చెప్పడానికి పౌరాణిక గాధలను ఉదహరిస్తారు. మహాభారతం చాలా ప్రాచుర్యం పొందిన పురాణం. ఇందులో శ్రీకృష్ణుని చే ఉటంకించబడిన భగవద్గీత ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, అత్యంత పవిత్రమైన మత గ్రంథంగా అభివర్ణించబడుతోంది. ఇందులో కృష్ణుడు యుద్ధ విముఖుడైన అర్జునుడికి కర్తవ్యబోధ చేసి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు.

మతం, తత్వం, పురాణాలు కలగలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిలో దేనిగురించి చెప్పాలన్నా మిగతా వాటిని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఇంకా ప్రజల్లో మతం, పురాణాలు ఒకటే ననే భావన ప్రబలంగా ఉంది. ఇది కూడా గందరగోళానికి కొంత వరకూ కారణం. పురాణాల్లో పేర్కొనబడ్డ పాత్రలను కల్పితం అనుకోకుండా వాటికి నిత్యం ప్రార్థనలు జరుగుతుంటాయి. ఈ నమ్మకాన్ని అందరూ గౌరవించినా శాస్త్రీయ విశ్లేషణకు మాత్రం సరిపోదు.

ఈ పురాణాల ఆధారంగా ఎన్నో సాంప్రదాయాలు, సంస్కృతులు,కృతువులు, పండుగలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, వాస్తు మొదలైనవి ఎన్నో ఆవిర్భవించాయి. ఓ వెయ్యి సంవత్సరాల క్రితం హిందూ సంస్కృతి అంతా పురాణాల నుంచే ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. కాలానుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకున్నా చాలావరకు అదే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. నేటి సంస్కృతే రేపటి పురాణమవుతుంది. కాబట్టి సంస్కృతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 comment:

Vasuki said...

రవిచంద్ర గారు

మీరు ఇక్కడ కూడా బ్లాగ్స్ వ్రాస్తున్నారా. ఇన్ని ఎలా వ్రాయగలుగుతున్నరండీ బాబు.

శ్రీవాసుకి

Post a Comment